పీర్జాదిగూడ: ఏడాదిలోపు పిల్లల్లో ఊపిరితిత్తులకు సంక్రమంచే వ్యాధి నివారణకు వేసే న్యూమోకాకల్ కాంజుగూట్ (పీవీసీ) వాక్సిన్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని దీనిని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేయర్ జక్క వెంకట్రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం నగరపాక సంస్థ కార్యాలయంలో వైద్య అధికారులు, రెవిన్యూ అధికారులతో న్యూమోకాకల్ కాంజుగేట్ వాక్సిన్ పంపిణీ పై మేయర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గురువారం నుంచి ప్రారంభమయ్యే ఈ వాక్సిన్ పక్రియ పీర్జాదిగూడ నగరపాలక సంస్థ సబ్ సెంటర్లో టీకాలు వేయనున్నట్లు నగరపాలక సంస్థ మేయర్ జక్క వెంకట్రెడ్డి పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ప్రతిభ మాట్లాడుతూ నగరపాలక సంస్థలో సంవత్సరంలోపు చిన్న పిల్లలకు గురువారం నుంచి ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని అన్నారు.
ముఖ్యంగా న్యూమోనియిమెనింజైటీస్, సెప్టిసిమియా, సైనసిటీస్, చెవి ఇన్ఫెక్షన్ల వ్యాధి నివారణ, తీవ్రతను తగ్గించడానికి వాక్సినేషన్ తప్పనిసరి అని పేర్కొన్నారు. మొదటి డోస్ ఆరు వారాలు, రెండో డోప్ 14 వారాలు, మూడో డోస్ 9 నెలల లోను సార్వత్రిక వ్యాధి నివారణలో భాగంగా పిల్లలకు వేయించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎం. శ్రీనివాస్, డిప్యూటి మేయర్ కుర్ర శివకుమార్గౌడ్, రెవిన్యూ అధికారలు తదితరులు పాల్గొన్నారు.