కులకచర్ల, మే 5 : బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. ఆదివారం కులకచర్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే పార్లమెంట్లో తెలంగాణ సమస్యలపై పోరాడే అవకాశముందన్నారు. అందుకోసం పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో కులకచర్ల మాజీ ఎంపీటీసీ మాలె కృష్ణయ్యగౌడ్, బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు వెంకటయ్య, బుచ్చయ్య, వెంకట్రాములు, చుక్కయ్య, బాలు, శ్రీశైలం, గ్రామస్తులు పాల్గొన్నారు.
పరిగి : పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకోసం పరిగి మున్సిపాల్ కేంద్రంలోని 2వ వార్డులో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరూ కారుగుర్తుకు ఓటు వేసి కాసానిని గెలిపించాలని కోరారు. ప్రచారంలో పరిగి మున్సిపల్ చైర్పర్సన్ ముకుంద అశోక్, నాయకులు సురేందర్కుమార్, రవికుమార్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.