తాండూరు రూరల్, మే 5 : మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు మండలం, గౌతాపూర్, అల్లాపూర్, కోటబాసుపల్లి, మల్కాపూర్, జినుగుర్తి, ఉద్దండాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఓడించాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి కాసానిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీసీ నాయకుడైన కాసాని 96 కులాల కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. ప్రచారంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ మండల నాయకులు రాజప్ప, వీరేందర్గౌడ్, శకుంతల, వెంకటేశం, వసంత్కుమార్, మొగులప్ప, జయపాల్రెడ్డి, పురుషోతరెడ్డి, ప్రదీప్రెడ్డి, రాకేశ్గౌడ్, శానప్ప, పాల్గొన్నారు.