కడ్తాల్, మే 5 : మండల కేంద్రంలోని ఫార్చ్యూన్ బట్టర్ఫ్లై సీనియర్ సెకండరీ స్కూల్లో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 నుంచి సాయం త్రం 5.20 గంటల వరకు పరీక్షను నిర్వహించారు.
మొత్తం 1008 మంది విద్యార్థులకు 972 మంది హాజరయ్యారని పరీక్ష కేంద్రా పరిశీలకులు అజయ్కుమార్, రఘువీర్గుప్తా, సంగీత, సెంటర్ సూపరింటెండెంట్ రంగారావు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.