సంస్థాన్ నారాయణపురం, ఏప్రిల్ 11: గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుంటే మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న వెంకంబావితండా లో మాత్రం అధికారులు, పంచాయతీ పాలకవర్గ సభ్యు లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. వెంకంబావితండా గ్రామంలో పల్లెప్రగతి పనులకోసం అధికారులు సర్వేనెం-164లో ఏడాది క్రి తం నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. చుట్టూ రైతుల భూములు ఉండి మధ్యలో దారి లేని గుట్ట ప్రాం తాన్ని కేటాయించారు.
ఆ స్థలం వద్దకెళ్లేందుకు దారి లేదని అధికారులు, సర్పంచ్కు తెలిసినా అక్కడే పల్లెప్రగతి పనులు చేపడుతున్నారు. దారి లేకపోవడంతో చుట్టుపక్కల రైతుల వ్యవసాయ భూముల నుంచి వెళ్తూ పల్లె ప్రగతి పనులను చేస్తున్నారు. ఆ స్థలంలో నాలుగు వేల మొక్కలతో పల్లెప్రకృతివనాన్ని ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. హరితహారం నర్సరీలో 10 వేల మొక్కలను పెంచుతున్నారు. డంపింగ్ యార్డు పనులు 80శాతం వరకు పూర్త య్యాయి. వైకుంఠధామం పనులు పిల్లర్ గుంతల దశలో నే ఆగిపోయింది. చుట్టుపక్కల భూములు ఉన్న రైతులు తమ భూముల్లోంచి వెళ్లకుండా అడ్డుకోవడంతోపాటు ఫె న్సింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పల్లెప్రకృతివనం, నర్సరీ, డంపింగ్యార్డు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. సర్వేనెం-164లోని ప్రాంతంలో పల్లెప్రగతి పనులు చేపట్టొద్దని తండావాసులు, రైతులు పనులను ప్రారంభించక ముందే నుంచే చెబుతున్నా అధికారులు, సర్పంచ్ పట్టించుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. పల్లెప్రగతి పనులకు కేటాయించిన స్థలానికి వెళ్లేందుకు నక్ష దారిలేదని తహసీల్దార్ ధ్రువీకరించడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది.
సెంటు భూమి కూడా ఇవ్వం..
పల్లెప్రగతి పనులు చేపట్టేందుకు అధికారులు గ్రామంలో కేటాయించిన స్థలానికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో సర్వేనెం 409, 410, 411, 168అ, 169అఆలోని రైతులకు సంబంధించిన వ్యవసాయ భూముల నుంచి వెళ్లా లి. రైతులు మొదటి నుంచీ దారి ఇవ్వమని చెబుతున్నా అధికారులు, సర్పంచ్ పనులు చేపడితే రైతులే ఇస్తారని మొండిగా వ్యవహరిస్తూ పనులు చేయిస్తున్నారు. తమ భూముల దగ్గరలో వైకుంఠధామాన్ని నిర్మిస్తే భూములకు డిమాండ్ తగ్గుతుందనే ఉద్దేశంతో రైతులు దారి ఇవ్వడానికి తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. కొందరు రైతులు తమ వ్యవసాయ భూముల నుంచి ఇతరులు వెళ్లకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సంబంధిత అధికారులు రైతులతో మాట్లాడి దారికి అవసరమైన భూ మి ఇస్తే వేరే ప్రాంతంలో భూమిని కేటాయిస్తామని చెప్పి నా రైతులు అంగీకరించడంలేదు. సెంటు భూమి కూడా ఇచ్చేది లేదని వారు అధికారులకు తేల్చిచెప్పారు. తమ వ్యవసాయ భూముల నుంచి దారి ఇవ్వడం కుదరదని పలుసార్లు అధికారులకు వినతిపత్రాలను కూడా సమర్పించారు రైతులు.
తీర్మానం చేసినప్పుడే వద్దని చెప్పా..
పాలకవర్గ సమావేశంలో తీర్మానం చేసినప్పుడే దారి లేదని వేరే ప్రాం తంలో స్థలం చూడాలని చెప్పాను. దారి సమస్యను పరిష్కరించిన తర్వా తే పల్లెప్రగతి పనులను ప్రారంభించాలని చెప్పినా సర్పంచ్ పట్టించుకోకుండా అక్కడే పనులు చేయిస్తున్నారు. పాలకవర్గ సభ్యుల మాటను సర్పంచ్ పట్టించుకోకుం డా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
-కరంటోతు సుశీల వార్డుసభ్యురాలు
నాపై ఒత్తిడి తెస్తున్నారు
గ్రామంలో చేపడుతున్న పల్లెప్రగతి పనులకు దారి లేకపోవడంతో నా వ్యవసాయ భూమి నుంచి దారి ఇవ్వాలని అడుగుతూ నాపై ఒత్తిడి తెస్తున్నారు. నా భూమిలో నుంచి దారి ఇవ్వడం కుదరదని సర్పంచ్కు గతంలోనే చెప్పి నా పట్టించుకోకుండా పనులను చేయిస్తున్నారు. అధికారులకు చాలాసార్లు వినతిపత్రాలను కూడా ఇచ్చాను. కష్టపడి సంపాదించుకున్న భూమిని ఎలా ఇస్తాం.
-దేప రాంరెడ్డి, రైతు
ఇవీ కూడా చదవండి…
వ్యాక్సిన్ వేస్టేజ్ను తగ్గించండి
శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్