నిర్మల్ ఏఎస్పీ కిరణ్ కారే
భైంసా పట్టణంలో తనిఖీలు
భైంసా, ఏప్రిల్ 11 : శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు నిర్మల్ ఏఎస్పీ కిరణ్ కారే అన్నారు. పట్టణంలోని ఓవైసీ నగర్లో ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచే పోలీసు బలగాలను కాలనీలో మోహరించారు. ఇంటింటా సోదాలు నిర్వహించారు. దీంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ద్విచక్రవాహన పత్రాలు, ఆధార్కార్డులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఎస్పీ మాట్లాడారు. ప్రజల సంక్షేమం, రక్షణ కోసమే పోలీసులు అహర్నిశలు కృషిచేస్తున్నారన్నారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు సాగించే అవకాశం లేకుండా నిఘా ఏర్పాటు చేసి, చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 116 బైకులు, ఒక కారు, 19 ఆటోలు, ట్రాక్టర్, గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. పట్టణ సీఐ వేణుగోపాల రావు, టౌన్ ఎస్ఐ ప్రదీప్, 160 మంది పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.