Urea booking | మెదక్ రూరల్, డిసెంబర్ 20 : యూరియా బుకింగ్ యాప్పై రైతులు అవగాహన కలిగి ఉండాలని మెదక్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ కుమార్ అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో శనివారం యూరియా బుకింగ్ యాప్పై రైతులకు అవగాహన కల్పించారు.
యూరియా కోసం రైతులు ఇంట్లో కూర్చొని ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ను డౌన్ లోడ్ చేసుకొని యూరియా సంచులను బుక్ చేసుకోవచ్చన్నారు. రైతులు ప్రస్తుతం జిల్లాలోని అన్ని షాప్లలో బుక్ చేసుకొనే అవకాశం ఉందని తెలిపారు. యూరియా బుకింగ్లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వ్యవసాయ విస్తరణ అధికారులను గానీ, డీలర్స్ గానీ సంప్రదించవచ్చునని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి , ఏవోలు రాజశేఖర్ రైతులు, తదితరులు పాల్గొన్నారు.
శిథిల పంచాయతీలు.. నూతన జీపీల్లో భవనాల నిర్మాణానికి కేసీఆర్ నాడు శ్రీకారం
Insurance Claim | తండ్రిపై రూ.3 కోట్ల బీమా చేశారు.. పాముకాటుతో చంపించారు..
Pilot Attack: ప్రయాణికుడిని కొట్టిన పైలట్.. సస్పెండ్ చేసిన ఎయిర్ ఇండియా