Delivery | రాయపోల్, ఏప్రిల్ 02 : దౌల్తాబాద్ మండల పరిధిలోని దొమ్మాట గ్రామానికి చెందిన మహిళకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే దౌల్తాబాద్ 108 అంబులెన్స్ సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ భాను, పైలెట్ నర్సింలు అక్కడికి చేరుకొని గజ్వేల్ హాస్పిటల్కి తరలించే క్రమంలో మహిళకి పురిటినొప్పులు అధికమవడంతో అంబులెన్స్ సిబ్బంది ప్రసవం చేశారు.
సదరు మహిళ పండంటి ఆడబిడ్డకి జన్మనివ్వగా.. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. వారిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబీకులు 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వగానే సమయానికి వచ్చిన అంబులెన్స్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. గర్భిణీలు అత్యవసర సమయంలో 108 సేవలను వినియోగించుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్, జిల్లా కో ఆర్డినేటర్ హరి రామకృష్ణ తెలిపారు.