Urea | రాయపోల్, ఆగస్టు 27 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని తిమ్మక్క పల్లి గ్రామ పరిధిలో వరి పంటలను గురువారం రాయపోల్ మండల వ్యవసాయ అధికారి నరేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వరిలో ఆకుచుట్టు పురుగు, కాండం తొలుచు పురుగు ఉన్నట్లు గమనించటం జరిగింది. యూరియా ఎక్కువ వాడితే పైన తెలిపిన పురుగు ఉధృతి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.. అందువల్ల రైతు సోదరులు అవసరం మేరకు మాత్రమే యూరియా దఫా దఫాలుగా వేయాలని పేర్కొన్నారు.
ఆకుచుట్టు, కాండం తొలుచు పురుగు నివారణకు కార్టాప్ హైడ్రో క్లో రైడ్ 4G గుళికలు ఎకరానికి 8 నుండి 10 కేజీలు లేదా కార్బోఫ్యురాన్ 3% G గుళికలు ఎకరానికి 10 కేజీలు ఇసుకలో కలిపి చల్లటం ద్వారా నివారించవచ్చు అని సూచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మకపల్లి సర్పంచ్ అశోక్ రెడ్డి, రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారి రజిత పాల్గొన్నారు.
Donald Trump | ఆయన బతికే ఉన్నా తీవ్ర గాయాలతో ఉన్నారు : డొనాల్డ్ ట్రంప్
Shoaib Akhtar | క్రికెట్ కోసం బాలీవుడ్ చాన్స్ వదులుకున్నా : షోయబ్ అక్తర్
Akhilesh Yadav | అంకిత్ బలియాన్ హత్య జాట్ సామాజిక వర్గంపై జరిగిన దాడి: అఖిలేష్ యాదవ్