Farmer Donation | చేర్యాల, ఏప్రిల్ 16 : రైతులు బాగుండాలంటే మళ్లీ కేసీఆర్ సారే ముఖ్యమంత్రిగా రావాలంటూ అన్నదాతలు నినదిస్తున్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితే రైతుల బతుకులు బాగుపడతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రైతులు సల్లగ బతికిండ్రు.. ఇప్పుడు పంటలు ఎండిపోయినయి, బోర్ల నుంచి చుక్క నీరు రావడం లేదు మళ్లీ కేసీఆర్ సార్ రావాలే.. రైతులు బాగుపడాలని రైతు నాగార్జున అభిప్రాయం వెలిబుచ్చారు.
బీఆర్ఎస్ బహిరంగ సభ విజయవంతం కోసం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు వాల్పోస్టర్లు ఆవిష్కరించి ముఖ్యనాయకులను కలిసి సభకు సంబంధించి సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఇవాళ మండలంలోని నాగపురి గ్రామానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులకు రైతు నాగార్జున ఎదురుగా వచ్చి తన వరిపొలం వద్దకు వారిని తీసుకుపోయి ఎండిపోయిన విషయాన్ని తెలియజేశారు. అనంతరం బీఆర్ఎస్ రజోత్సవ సభకు తనవంతుగా రూ.1000 విరాళంగా అందజేసి కేసీఆర్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, మాజీ ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, ఏఎంసీ మాజీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, బీఆర్ఎస్ మహిళ మండల అధ్యక్షురాలు మీస పార్వతి, బీఆర్ఎస్ నాయకులు బండమీది కరుణాకర్, ప్రజ్ఞాపురం నర్సింహులు, సత్యనారాయణ, గ్రామ ముఖ్య నాయకులున్నారు.
BRS dharna | జూరాల ఆయికట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలి బీఆర్ఎస్ ధర్నా
Srinivas Goud | బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్