Social Media | రాయపోల్, జూలై 03 : విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధించి భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని దౌల్తాబాద్ ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, షీ టీమ్ నిర్వహిస్తున్న విధుల గురించి, షీ టీమ్ ద్వారా ఎలా రక్షణ పొందొచ్చు అనే అంశాలు, ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు, నూతన చట్టాల గురించి అవగాహన కల్పించారు.
అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ మాటలు నమ్మవద్దు. సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుంది. మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. మహిళల భద్రత మా ముఖ్య బాధ్యత. చదువుకునే సమయంలో చెడు అలవాట్లకు బానిస కావొద్దు అన్నారు. ప్రతీ ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని తెలిపారు. డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని అన్నారు. పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలని.. సామాజిక రుగ్మతల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ షీటీమ్ బృందం హెడ్ కానిస్టేబుల్ మహేందర్ రెడ్డి, మహిళా కానిస్టేబుల్ శ్యామల, కానిస్టేబుల్ మహేష్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్ లక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు.
DEO Radha Kishan | కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో రాధా కిషన్