చిలిపిచెడ్, జూలై 3: మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని కేజీబీవీ, పలు పాఠశాలను జిల్లా విద్యాధికారి రాధా కిషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిలిపిచేడ్లో ఉపాధ్యాయుల హాజరు, పాఠ్య ప్రణాళికల దినచర్య, తరగతి గది బోధన, రికార్డులను పరిశీలించారు. తరగతి గదిలో ప్రత్యక్షంగా విద్యార్థులచే మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా విద్యాధికారి అడిగిన ప్రశ్నలకు విద్యార్థుల నుండి సరైన సమాధానాలు రావడంతో విద్యార్థులు ఉపాధ్యాయులను అభినందించారు. అదేవిధంగా మండలంలో నూతనంగా ప్రారంభమైన కేజీవీబీ జూనియర్ కళాశాల ను సందర్శించి వసతి సౌకర్యాలు, బోధన సిబ్బందిని గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లా విద్యాధికారి వెంట మండల విద్యాధికారి విఠల్, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ రమేష్ పాల్గొన్నారు.