Nano Urea | రాయపోల్, ఆగస్టు 21 : యూరియా వాడకాన్ని తగ్గించి నానో ఏరియా వాడాలని గజ్వేల్ వ్యవసాయ శాఖ ఏడీఏ బాబు నాయక్ రైతులకు సూచించారు. గురువారం రాయపోల్ మండల కేంద్రంలో నానో ఏరియా వాడకంపై వ్యవసాయ శాఖ ఏడీఏ బాబు నాయక్ క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా గూని లక్ష్మీ సాగు చేస్తున్న ప్రత్తి పంటపై నానో యూరియా పిచికారి చేసి నానో యూరియావాడకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి రైతులకు విధంగా వివరించారు.
నానో యూరియా – ముఖ్యమైన అంశాలు :
1. ప్రయోజనాలు:
• నైట్రోజన్ వినియోగ సామర్థ్యంను గణనీయంగా పెంచుతుంది.
• మొక్కల పెరుగుదల, ధారాళమైన దిగుబడి, నాణ్యతను మెరుగుపరుస్తుంది.
• సాధారణ యూరియాపై ఆధారాన్ని తగ్గించి, వ్యయాన్ని తగ్గిస్తుంది.
• పర్యావరణహితం – నైట్రోజన్ లీచింగ్ తగ్గి మట్టి , నీటి కాలుష్యం తగ్గుతుంది.
2. వినియోగ విధానం:
• ప్రధాన పంట దశల్లో వాడితే మెరుగైన ఫలితాలు అందుతాయి (ఉదాహరణకు: తొలకరి, పుష్పించు దశ).
• మోతాదు: 1 లీటర్ నీటికి 2 నుంచి 4 మిల్లీ లీటర్లు స్ప్రే చేయాలి.
• ప్రతి పంట కాలంలో 2 సార్లు ఉపయోగించడం ఉత్తమం.
3. అనుకూల పంటలు:
• వరి, గోధుమ, పత్తి, మక్కజొన్న, కూరగాయలు, పప్పుదినుసులు, నూనె గింజల పంటలు
4. అదనపు సమాచారం:
• 500 మిల్లీ బాటిల్ రూపంలో అందుబాటులో ఉంది – ఇది ఒక యూరియా బస్తాకు సమానం.
• వ్యవసాయ రంగం నుండి వచ్చే హరిత గృహ వాయువుల ఉద్గారాలు తగ్గించడంలో సహాయపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ నరేష్, వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రవీణ్ కుమార్, రైతులు పాల్గొన్నారు.
Mancherial | 108 అంబులెన్స్లో ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం
MLA Gaddam Vinod | మద్యం మత్తులో జాతీయ రహదారిపై ఎమ్మెల్యే వినోద్ అనుచరులు, పీఏల హల్చల్.. వీడియో
Malayalam Actress | హోటల్కి రమ్మన్నాడు.. యువ రాజకీయ నాయకుడిపై ప్రముఖ నటి లైంగిక ఆరోపణలు