Labourers | పటాన్ చెరు, అక్టోబర్ 30 : పాశమైలారంలోని బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో సీఐటీయూ అనుబంధంగా యూనియన్ ఏర్పాటు చేశామని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు, బిస్లెరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు అతిమేల మాణిక్ అన్నారు. గురువారం
పటాన్ చెరు శ్రామిక్ భవన్లో జరిగిన బిస్లెరీ ఇంటర్నేషనల్ పరిశ్రమ కార్మికుల సమావేశానికి ముఖ్యఅతిథిగా అతిమేల మాణిక్ హాజరై మాట్లాడారు.
ప్రజాస్వామ్యయుతంగా పాశమైలారం ఫేస్-3 లోగల బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో కార్మికులు అందరూ ఐక్యంగా సీఐటీయూ అనుబంధంగా యూనియన్ ఏర్పాటు చేసుకున్నారని, కార్మికులందరికీ సీఐటీయూ అభినందనలు తెలియజేస్తుందని అన్నారు. కార్మికులు అందరూ ఐక్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం సీఐటీయూ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. యూనియన్ ఏర్పాటు చేసుకున్న విషయాన్ని రిజిస్ట్రేషన్ కాఫీ జతపరిచి యాజమాన్యానికి లెటర్ ఇవ్వడం జరిగిందని అన్నారు.
యాజమాన్యం సానుకూలంగా స్పందించి త్వరలోనే యూనియన్ ఇంట్రడక్షన్ జాయింట్ మీటింగ్ ఇస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. యాజమాన్యం యూనియన్కు సహకరించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. యూనియన్ ఏర్పాటు చేసుకున్న విషయాన్ని రిజిస్ట్రేషన్ కాఫీ జతచేస్తూ కార్మిక శాఖ అధికారులు డిప్యూటీ లేబర్ కమిషనర్, జాయింట్ లేబర్ కమిషనర్, సీఐ భానూర్, పటాన్ చెరు డీఎస్పీకి లెటర్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు.
కార్మిక సమస్యల పరిష్కారం కోసం యూనియన్ కృషికి సహకరించాలని అన్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ పటాన్ చెరు ఏరియా నాయకుడు బి నాగేశ్వరరావు, ఐడీఏ పాశమైలారం క్లస్టర్ నాయకుడు రాజు, బిస్లెరీ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రెటరీ ఎన్.శేఖర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, జాయింట్ సెక్రెటరీ అజయ్ ఠాకూర్, కోశాధికారి నవీన్ కమిటీ సభ్యుడు రాము నాయక్, అమిత్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Hot Fish Curry: భార్య ముఖంపై వేడి చేపకూర చల్లిన భర్త
Quality Seeds | నాణ్యమైన విత్తనాలతో పంట దిగుబడి .. రైతులకు అవగాహన