Farmers | ఎండాకాలం దాటి వర్షాకాలం మొదలైనా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవాలంటే రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. నెలల తరబడి వేచి ఉన్నా ధాన్యాన్ని కొనే నాథుడే కరువైపోయాడు. మరోవైపు వర్షాలు పడుతుండటంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం ఎక్కడ తడిసిపోతుందోనని బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి ఏర్పడుతోంది.
కాగా సంగారెడ్డి జిల్లా కల్కేరు మండలంలో జొన్న రైతులు ఆందోళన బాట పట్టారు. జొన్నల కొనుగోలు ఆలస్యం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రానికి వెళ్తున్న డీసీఎంను అడ్డగించారు. 12 వేల గోనె సంచులను తీసుకెళ్లిన రైతులు, వర్షాలు, బస్తాల కొరతతో గోనె సంచులను తీసుకెళ్లారు.