Demolitions | కాంగ్రెస్ సర్కార్ బుల్డోజర్లతో మరోసారి పేదల ఇండ్లపై ఝులుం ప్రదర్శించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం లేకుండా సంగారెడ్డి జిల్లాలో పేదల షెడ్లు కూల్చివేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు మండలం బిల్లాపూర్లో పేదలకు ప్రభుత్వ భూమిలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు ఇచ్చిన స్థలంలో పేదలు షెడ్లు వేసుకొని చిరువ్యాపారాలు నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.
ఆ భూముల్లో వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి అండతో అధికారుల దౌర్జన్యం చేస్తున్నారు. తమ షెడ్లను ఎందుకు కూల్చుతున్నారో తెలుపకుండా అధికారులు రాత్రికి రాత్రి బుల్డోజర్లతో షెడ్లను కూల్చివేశారు. ఈ విషయం తెలసుకున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి స్థానిక ప్రజలతో కలిసిబిల్లాపూర్ గ్రామాన్ని సందర్శించి కూల్చివేసిన ప్రాంతంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకోకు దిగారు.
సంగారెడ్డి జిల్లాలో పేదల షెడ్లు కూల్చివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు మండలం బిల్లాపూర్లో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి అండతో అధికారుల దౌర్జన్యం
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలకు ప్రభుత్వ భూమిలో పట్టాలు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే భూపాల్… pic.twitter.com/r889fY5Ciw
— Telugu Scribe (@TeluguScribe) July 25, 2026