టేకులపల్లి, సెప్టెంబర్ 17 : గిరిజన, ఆదివాసీల గూడేలను పంచాయతీలుగా చేసి, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కేసీఆర్ పుణ్యమేమని, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచి రాజకీయ భవిష్యత్కు బాటలు వేసిన మాజీ సీఎం కేసీఆర్ లంబాడీ గిరిజనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ అన్నారు. టేకులపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్ పేరిట గిరిజనులకు మోసం చేసిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మయామటలు చెబుతుందన్నారు. 36 పంచాయతీలల్లో నాయకులు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. బొమ్మనపల్లిలో బొమ్మెర్ల వరప్రసాద్, టేకులపల్లిలో బోడాబాలు, బానోత్ రామానాయక్, భూక్య లాలు, ఆమెడ రేణుక, లకావత్ నాకా, భూక్య బాలకృష్ణ, మాలోత్ సురేందర్, నాగభూషణం పాల్గొన్నారు.