Petrol Bunks | నర్సాపూర్, మార్చి26 : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సంపూర్ణంగా ఉన్నాయని ఓ వైపు ప్రభుత్వం చెబుతున్నా.. మరోవైపు నర్సాపూర్లో మాత్రం పెట్రోల్ బంకులను నిర్వాహకులు బంద్ చేశారు. వివరాల్లోకి వెళ్ళితే నర్సాపూర్ పట్టణంలోని హైదరాబాద్ మార్గంలో గల టీఎస్ఆర్టీసీకి సంబంధించిన పెట్రోల్ బంక్.. అలాగే సంగారెడ్డి మార్గంలో గల హెచ్పీ పెట్రోల్ బంకులను బంకు నిర్వాహకులు గురువారం బంద్ చేశారు.
మధ్యాహ్నం వరకు నడిపించిన బంకులను ఒక్కసారిగా మూసివేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామ సమీపంలో గల పెట్రోల్ బంక్లో ఏకంగా నో స్టాక్ బోర్డు పెట్టడం జరిగింది. వీటిపై బంకు నిర్వాహకులను వివరణ కోరగా.. పెట్రోల్, డీజీల్ స్టాక్ అయిపోయిందని తిరిగి గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం వస్తుందన్నారు.
ఈ క్రమంలో బంకులకు వచ్చిన వాహనదారులు పెట్రోల్, డీజీల్ లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. నిజంగానే పెట్రోల్, డీజీల్ అయిపోయిందా లేక కృత్రిమ కొరత సృష్టించడానికి బంకు యాజమాన్యం ఇలా చేస్తుందా..? అని పలువురు ప్రయాణికులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తహసిల్దార్ శ్రీనివాస్ను వివరణ కోరగా.. ప్రభుత్వం వద్ద స్టాక్ పుల్గా ఉందని.. బహుశా పెట్రోల్ బంక్ వారు బుక్ చేసుకోలేదేమోనని అన్నారు. దీని గురించి విచారణ చేపడతామని తెలిపారు.

4 ఇన్క్లైన్లో హైమాస్ట్ లైట్లు బంద్ చేసే వారే లేరా?
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి : నల్లగొండ డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ అలీ