Collector Rahul Raj | మెదక్ రూరల్, అక్టోబర్ 23 : పోషన్ అభియాన్ జాతీయ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పోషణ్ మాసం కార్యక్రమాన్ని శ్రీ శిశు సంక్షేమ శాఖ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంపూర్ణ ఆహారం, పిల్లలు ఆడుకునే బొమ్మలు, ప్రకృతిలో దొరికే ఆకుకూరలు, పిండి పదార్థాలతో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. రక్తహీనత, పోషణ లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. బాల్య వివాహాలు జరిపిస్తే పెళ్లికొడుకు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, అంగన్వాడీ ఏఎన్ఎంలను జైల్లో వేస్తామన్నారు. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుండి ప్రసవం అయిన తర్వాత వైద్య పరంగానే కాకుండా.. పోషణ పరంగా కూడా ప్రభుత్వం శ్రద్ద పెడుతుందన్నారు. అంగన్వాడీ సెంటర్లలో ప్రతి రోజు కోడిగుడ్లు, పాలు ఇస్తున్నారని… వాటి ద్వారా కడుపులో ఉన్న బిడ్డలకు పోషకాహారం అందాలని… తెల్లటి అన్నం మాత్రమే తినడం వల్ల రక్తం రాదని.. ప్రతి మహిళ ప్రసవానికి బిడ్డకు.. బిడ్డకు కనీసం మూడు సంవత్సరముల గ్యాప్ ఉండాలన్నారు.
ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్ధాలనే లక్ష్యంతో..
గర్భిణీలు,బాలింతలు తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రంలోని పాలు, గుడ్లు ఆహారం తీసుకోవాలన్నారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు, మహిళలు, కిషోర బాలికలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్ధాలనే లక్ష్యంతో పోషణ మాసం నిర్వహిస్తున్నమన్నారు. ఇందులో భాగంగా ఆరోగ్యజీవనానికి కావాల్సిన పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తూ మహిళలు, గర్భిణీల శిశువుల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
రక్త హీనత లేకుండా చూడడంలో మరింత దృష్టి పెట్టాలని.. గర్భిణీ లకు ఇస్తున్న ఆహారాన్ని వారు మాత్రమే తినాలని.. ఇతరులు తీసుకోవద్దన్నారు. నిర్ణీత గడువులోపు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్న చిన్న పిల్లలను చూసుకోవడంలో అంగన్వాడీ టీచర్లు బాధ్యతయుతంగా ఉంటారని.. అందుకు వారిని అభినందించాలన్నారు. ప్రీ ప్రైమరీ విద్యకు సంబంధించి.. ఎలా భోదిస్తే పిల్లలకు సులభంగా అర్ధమవుతుందో.. అలాగే అంగన్వాడీ టీచర్లు చెప్పాలన్నారు.
గర్భిణీలకు, శిశువులకు ఆరోగ్యం పట్ల అవగాహన పెరగాలి..
పోషణ మాసంలో భాగంగా జరిగే కార్యక్రమాల ద్వారా గర్భిణీలకు, శిశువులకు మంచి ఆరోగ్యం పట్ల అన్ని అంశాల మీద అవగాహన పెరగాలన్నారు. వ్యక్తిగత శుభ్రత, ఐరన్ టాబ్లెట్లు వేసుకోవడం, ఫీడింగ్ విషయంలో జాగ్రత్తల మీద అందరికి అవగాహన ఉండాలన్నారు. గర్భిణి స్థాయి నుండి బిడ్డకు 3 సంవత్సరాలు వచ్చే వరకు ఆ మహిళను జాగ్రత్తగా చూసుకుంటేనే వారి ఆరోగ్యానికి మంచి పునాది వేసినట్టు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చివరగా శ్రీశిశు సంక్షేమ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను కలెక్టర్ అందజేశారు. బాల్య వివాహాలు నిలిపివేయాలంటూ బ్యానర్ను ఆవిష్కరించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణీలకు శ్రీమంత కార్యక్రమము నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా సంక్షేమ అధికారి హేమా భార్గవి, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, అడిషనల్ డిఆర్డిఓ , ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిని, విజయలక్ష్మి, ఎంసిహెచ్డీఎంఈ లు, విజయనిర్మల, జయలక్ష్మి , జిల్లాలోని గర్భిణీ స్త్రీలు, బాలింతలు, సీడీపీవోలు, సూపర్వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Biopic | ఛావా డైరెక్టర్ కొత్త బయోపిక్ .. తెరపైకి ఫోక్ డాన్సర్ జీవిత చరిత్ర
Actor Vijay | విజయ్ వాహనాలన్నింటికీ 0277 నంబర్.. దాని వెనుక ఉన్న ఎమోషనల్ కథ తెలుసా..?
Sara Ali Khan | కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్న సారా అలీ ఖాన్.. ఫొటోలు