Manda krishna madiga | నర్సాపూర్, ఆగస్ట్ 24 : రాష్ట్రంలో వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచకపోతే తాడోపేడో తేల్చుకుంటామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో గల చాముండేశ్వరి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి ఆదివారం నాడు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా పెన్షన్ల పెంపు అమలుకు పోరాటం చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేయడం లేదని, పాత పెన్షన్లను పెంచడం లేదని మండిపడ్డారు. పెన్షన్ల పెంపు కోసం సెప్టెంబర్ 9న హైదరాబాద్లో మహాసభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు 25 డిమాండ్లు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా పెన్షన్లు పెంచకపోవడం సిగ్గుచేటన్నారు.
కొత్తగా 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, రాష్ట్రంలో 60 లక్షల పేద కుటుంబాల వారు ఉన్నారని గుర్తుచేశారు. పక్క తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు పెంచడం జరిగిందని, వారిని చూసి నేర్చుకోవాలని చురకలంటించారు. ఇప్పటి వరకు 75 నియోజకవర్గ సన్నాహాక సమావేశాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. పెన్షన్ల పెంపు కోసం రాజీ లేని పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Daisy Shah | వాళ్లకి నడుము, బొడ్డు పిచ్చి ఉంది.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన వ్యాఖ్యలు
IADWS | ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ
Finger Millet | రాగులను అసలు రోజుకు ఎంత మోతాదులో తినాలి..? వీటితో కలిగే లాభాలు ఏమిటి..?