Drunk And Drive | రామాయంపేట, జులై 03 : వాహనాలు నడిపించే ప్రతీ ఒక్కరూ రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని రామాయంపేట ఎస్సై బాలరాజు అన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ఇక నేరుగా జైలుకే వెళ్లాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. గురువారం రామాయంపేట రహదారిపై వాహనాలను తనిఖీ చేసి వాహన డ్రైవర్లకు ఆయన పలు సూచనలు చేశారు.
వాహనం నడిపించే ప్రతీ ఒక్కరూ తమ వాహనానికి సంబంధించిన కాగితాలు, సీట్ బెల్ట్, బైకులు నడిపిస్తే హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్సులు కచ్చితంగా వెంటే ఉండాలన్నారు. అంతేగాకుండా ఆటోలు నడిపించే వారు సామర్ద్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దన్నారు. వాహనాలను ఎక్కువ స్పీడ్గా నడిపించి ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దన్నారు.
ఎక్కువ శాతం ప్రమాదాలు మద్యం తాగడం వల్ల జరుగుతున్నాయని డ్రైవింగ్ చేసే ముందు మద్యం ముట్టవద్దన్నారు. మద్యం వల్ల విలువైన ప్రాణాలు పోతున్నాయని తెలిపారు. తమ ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా జాగ్రత్తగా గమ్యస్థానానికి వెళ్లాలన్నారు. ఎస్సై బాలరాజు వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.
DEO Radha Kishan | కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో రాధా కిషన్