Farmers | చిలిపిచెడ్ మండలంలో ఏకైక సొసైటీ సోమక్కపేట సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంఘం సీఈఓ పోచయ్యతో కలిసి తహసీల్దార్ సహదేవ్ గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆశ్రయించాలని అన్నారు. ధాన్యాన్ని ఐకేపీ, సొసైటీలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలన్నారు. అలాగే రైతులు తమ ధాన్యంలో తేమశాతం 17కి మించకుండా ఉండాలని, బాగా ఎండబెట్టి తాలు మట్టి లేకుండా ఉండే విధంగా ఉండాలన్నారు.
తూకం వేసిన వెంటనే రైతుల తమ బ్యాంక్ అకౌంట్, పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ సెంటర్ ఇన్చార్జ్కు అందజేయాలన్నారు. ఆన్లైన్లో అప్లోడ్ కాగానే 24 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమచేస్తారని తెలిపారు. ఎ గ్రేడ్ మద్దతు ధర 2389 రూపాయలు, సాధారణ రకం 2369 రూపాయలు, సన్నరకం ధాన్యంకు అదనంగా బోనస్ 500 రూపాయలు ఇస్తారని తహసీల్దార్, సీఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది,రైతులు తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Local Body Elections | స్థానిక ఎన్నికల నామినేషన్లు షురూ.. కీలక ప్రకటన చేసిన ఎస్ఈసీ
KCR | బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్కు పితృ వియోగం.. సంతాపం తెలిపిన కేసీఆర్