MLA Sunitha Laxma Reddy | నర్సాపూర్ : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్ను తక్షణమే నిలిపివేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే అంశాన్ని ఇవాళ అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ విషయమై సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ ఏర్పాటు మూలంగా మూడు మండలాలకు నష్టం వాటిల్లుతుందని వెల్లడించారు.
డంపింగ్ యార్డ్కు సేకరించిన 152 ఎకరాల భూమి గ్యాప్ ల్యాండ్ అంటూ ప్రభుత్వం చెబుతుందని, అది గ్యాప్ ల్యాండ్ కాదని.. నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాలకు సంబంధించిన అటవీ భూమి అని పేర్కొన్నారు. ఈ భూమిని ప్రభుత్వం వెంటనే సర్వే చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
డంపింగ్ యార్డ్ నిర్మాణంపై ఇప్పటికే కోర్టు స్టే ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రశ్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిస్తూ డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులను పరిశీలిస్తామని తెలిపారు.
Read Also :
HYDRAA | బండ్లగూడలో హైడ్రా కూల్చివేతలు
ASP Chittaranjan | విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం తథ్యం : ఏఎస్పీ చిత్తరంజన్
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్రావు