Panchayat Labourers | నర్సాపూర్, మార్చి 12 : అసెంబ్లీ సమావేశాల్లో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై చర్చించి పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు గురువారం నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను ఈ అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే సునితాలక్మారెడ్డి చర్చించి సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు కోరారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నెలా 5వ తేదీలోపు గ్రీన్ ఛానెల్ ద్వారా వేతనాలు ఇస్తామని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని, జీతాల పెంపుదల, ఉద్యోగ భద్రత, ప్రమాదబీమా సౌకర్యాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత మూడు నెలల నుండి జీతాలు రాక కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని అన్నారు. మార్చి 17వ తేదీన ఛలో హైదరాబాద్ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న గ్రామపంచాయతీ కార్మికులందరు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు చంద్రయ్య, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
Dhurandhar | సీక్వెల్ రిలీజ్ ముందు సంచలనం.. 500 స్క్రీన్లలో రీ-రిలీజ్కి సిద్ధమైన దురంధర్ చిత్రం
Anurag Kashyap | ఎప్స్టీన్ ఫైల్స్తో నాకు సంబంధం లేదు: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్
Yami Gautam | ఆదిత్య ధర్ బర్త్డే.. భర్తపై ఎమోషనల్ పోస్ట్ పెట్టిన యామీ గౌతమ్!