Padma Devender Reddy | మెదక్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): మెదక్ పట్టణంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం మెదక్ పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మెదక్ పట్టణాన్ని పదేండ్ల కాలంలో అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని.. ఎన్నికల్లో తమ అభ్యర్థులను ఆశీర్వదించాలని పద్మాదేవేందర్ రెడ్డి కోరారు. మెదక్ పట్టణాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి ఎంతో అభివృద్ధి చేశామని కొనియాడారు. ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపిస్తే అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Suryapet : ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్పై వేటు వేయాలి : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
BC JAC : మిర్యాలగూడలో బీసీ జేఏసీ నాయకుల ముందస్తు అరెస్ట్
Arrest : కనగల్ బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్