నల్లగొండ సిటీ, ఫిబ్రవరి 04 : నేడు సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ పర్యటనలో నేపథ్యంలో బీఆర్ఎస్ కనగల్ మండల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. వారిలో పార్టీ మండల అధ్యక్షుడు అయితగోని యాదయ్య గౌడ్, పులకరం వెంకటేశం, బండమీది రాము, బుర్రి శ్రీమన్ కుమార్, ఏటెల్లి సైదులు, దోమలపల్లి యాదయ్య, మామిడాల శివ, పగిల్ల యాదయ్య, కందుల రమేష్, జినుకుంట్ల నరసింహ, ఏటెల్లి శంకర్ నాథ్, కందుల ప్రవీణ్, అనుముల అజయ్, కిషన్, కానుగు భూపతి, నాగరాజు ఉన్నారు.