హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. నియోపోలీస్ బ్రిడ్జి సమీపంలో అదుపుతప్పిన ఓ కారు బ్రిడ్జి పిల్లర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
రాజస్థాన్కు చెందిన కనైయాలాల్ (25), దేరామ్ (24) కొల్లూరు పరిధిలోని ఇంద్రారెడ్డి నగర్లో నివసిస్తూ టైల్స్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి వీరిద్దరూ కారులో ఇంద్రారెడ్డి నగర్ నుంచి నానక్రామ్గూడ బయల్దేరారు. అతివేగంగా వస్తుండటంతో నియోపోలీస్ బ్రిడ్జి సమీపంలో వారి కారు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న బ్రిడ్జి పిల్లర్ను ఢీకొట్టటింది. ఈ ఘటనలో కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.