మిర్యాలగూడ టౌన్, ఫిబ్రవరి 04 : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాలగూడకు ప్రచార సభకు నేడు వస్తుండడంతో ముందస్తుగా బీసీ జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్బంగా బీసీ జేఏసీ పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడమే సవాలుగా మారిందన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అక్రమ, ముందస్తు అరెస్టులతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరన్నారు. అరెస్ట్ అయినా వారిలో బీసీ జేఏసీ మిర్యాలగూడ నియోజకవర్గం అధ్యక్షుడు గుండెబోయిన నాగేశ్వరావు యాదవ్, బీసీ యువజన సంఘం పట్టణ కార్యదర్శి దోనేటి శేఖర్ ముదిరాజ్, బీసీ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి బంటు కవిత, చిత్రం ఉమా ఉన్నారు.