దండేపల్లి : 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు.దండేపల్లి మండలంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వందశాతం పూర్తి చేసేలా వైద్య, జీపీ సిబ్బందికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందరు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.ఇప్పటి వరకు ఎంతమంది టీకాలు వేసుకున్నారు..?అని అడిగి తెలుసుకున్నారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగం పెంచాలని సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ చంద్రకళ, జీపీ కార్యదర్శి శ్రీలత, ఏఎన్ఎంలు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.