న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ‘ఈవీఎం-వీవీప్యాట్ల లెక్కింపు’నకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లలో పోలైన అన్ని ఓట్లను మొత్తం వీవీప్యాట్ల స్లిప్పులతో (100% స్లిప్పులతో) సరిపోల్చాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. బ్యాలెట్ పద్ధతిలోనే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్ను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం తీర్పును వెలువరించింది.
సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షానికి ఇది చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. ఈవీఎంలపై అపనమ్మకాన్ని సృష్టించినందుకు క్షమా పణ లు చెప్పాలని డిమాండ్ చేశారు.