నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీరు వచ్చి చేరుతున్నది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి సోమవారం సాయంత్రం నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో మంగళవారం ఉదయం నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి వరద వచ్చి చేరిందని ఏఈఈ వంశీ తెలిపారు. బుధవారం ఉదయం వరకు ఎస్సారెస్పీ నీటిమట్టం స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. బాబ్లీ ప్రాజెక్ట్ ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టినట్లు మహారాష్ట్ర అధికారులు సమాచారం అందించారని తెలిపారు.
ఎస్సారెస్పీలోకి 3,893 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నదన్నారు. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి 1063.60 అడుగుల (18.158 టీఎంసీలు) వద్ద ఉన్నదని ఏఈఈ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
విద్య ద్వారానే సమాజంలో మార్పు : ఎమ్మెల్సీ కవిత
రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం
ప్రజలకు సుపరిపాలన అందించేందుకే కలెక్టరేట్ల నిర్మాణం
పల్లె ప్రగతి పెండింగ్ పనులు 19 లోపు పూర్తి చేయాలి