పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని
బెల్లంపల్లిలో నేతకాని మహర్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ కృతజ్ఞతాభినందన సభ
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి హాజరు
బెల్లంపల్లి టౌన్, జూలై 11: దళిత సాధికారత పథ కం విప్లవాత్మక నిర్ణయమని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని అన్నారు. దళిత సాధికారత పథకం ప్రవేశపెట్టినందుకు గాను నేతకాని మహర్ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పద్మశాలీభవన్లో ఆదివారం సీఎం కేసీఆర్కు ఏర్పాటు చేసి న కృతజ్ఞతాభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మె ల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సంఘం బలోపేతానికి కృషి చేసి అసువులు బాసిన గంగరా జు, మచ్చ కనకకయ్య, జ్ఞానందం మృతి చెందడం తో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సం దర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మా ట్లాడుతూ హైదరాబాద్లో నేతకానిభవన్ ఏర్పాటు కు ఇప్పటికే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నా రు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కూడా భవన్ ఏర్పాటుకు ఎంపీ ల్యాడ్స్ నిధులు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా అర్హులైన ద ళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామనడం హ ర్షణీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, నేతకాని ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షు డు భువ న చంద్ర, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయి ని ప్రసాద్, పోలీస్ ఉద్యోగుల సం ఘం బోర్లకుంట పోచలింగం, రాష్ట్ర నాయకులు దుర్గం నర్సయ్య, జాడి నర్సయ్య, ఆర్కే నేత, సమన్వయ కమిటీ స భ్యులు దుర్గం గోపాల్, కలాలి నర్సయ్య, గోళ్ల రాజమల్లు, దుర్గం రాజేశ్, బోర్లకుంట ప్రభాకర్, జు మ్మి డి కుమార్, గోమాస రాజన్న పాల్గొన్నారు.
దివ్యాంగుల సంక్షేమానికి కృషి..
దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ఆదివారం దివ్యాంగులకు 24 ట్రై సైకిళ్లు పంపిణీ చేసి, 23 చెత్త ట్రాలీలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ము న్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్తో కలిసి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు రూ. 3 వేల పింఛన్ అందిస్తూనే ట్రై సైకిళ్లను అందిస్తున్నారన్నారు. ఎ మ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ భావితరాల కోసమే హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అంతకు ముందు ఏఎంసీ గ్రౌండ్ ఎదుట నిర్వహించిన హరితహారంలో పా ల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గడ్డం పావని కల్యాణి, ఏసీపీ రహమాన్, సీడీపీవో మాస ఉమాదేవి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బొడ్డు నారాయణ, నెన్నెల మండలాధ్యక్షుడు గడ్డం భీమాగౌడ్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ఆర్పీలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
వాహనదారులకు అలర్ట్.. బల్కంపేటలో ట్రాఫిక్ ఆంక్షలు
మెదక్లో పోక్సో కోర్టు ప్రారంభం