palamuru students | తమకు నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతంలో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 వేలు మెస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనను అడ్డుకునేందుకు వచ్చిన ప్రిన్సిపల్తో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు.
విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ వైఖరి నశించాలి. మాకొద్దు నాణ్యత లేని భోజనాలు మాకొద్దు.. అంటూ నినాదాలు చేశారు. సమాచారమందుకున్న పోలీసులు ఆందోళనను విరమింపచేయాలని విద్యార్థులను అడుగగా..ఈ భోజనం పశువులు కూడా తినవు సార్.. పోలీసులతో తమ గోడు వెళ్లబోసుకున్నాడు. విద్యార్థుల ఆందోళనతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
నాణ్యమైన ఆహారం పెట్టడంలేదని ఆందోళనకు దిగిన పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతంలో నాణ్యమైన ఆహారం పెట్టడంలేదని రోడ్డుపై బైఠాయించిన పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు
ఒక్కో విద్యార్థి నుండి రూ.10,000 మెస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం… pic.twitter.com/1x9w4iSukc
— Telugu Scribe (@TeluguScribe) February 18, 2026