KTR | ఆదివారం (రేపు) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. మాజీ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లాలో విజయఢంకా మోగించిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచులకు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు కేటీఆర్ సన్మానం చేయనున్నారు.
ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మర్రి జనార్దన్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. కేటీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Hyderabad Real Estate | హైదరాబాద్ రియల్టీ డౌన్.. 23 శాతం పడిపోయిన ఇండ్ల అమ్మకాలు
పాలమూరు ప్రాణం మీదికొస్తే శంఖారావమే!
Gold Price | ఆల్టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. తులం ధర 1.42 లక్షలు