బిర్సాముండా గంగారం : భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న తొలి ఆదివాసీ వీరుడు బిర్సాముండా అని తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూర్క యాదగిరి అన్నారు. సోమవారం మండలకేంద్రంలో ఆదివాసీ ఉద్యోగ సంఘం, ఆదివాసీ తుడుందెబ్బ నాయకుల ఆధ్వర్యంలో బిర్సాముండా 146వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలోభాగంగా బిర్సాముండా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన కాకతీయ యూనివర్సిటీ ప్రోపెసర్ ఈసం నారాయణ మాట్లాడుతూ..స్వాతంత్య్ర పోరాటంలో ఆదివాసీ వీరుడు బిర్సాముండా అనేక పోరాటాలు చేసిన మహనీయుడని ,అలాంటి వీరుని కులాలకు అతీతంగా బిర్సా జయంతి వేడుకలు గ్రామాలలో వారం రోజుల పాటు జరుపుకోవాలని ,బిర్సాముండాను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం అధ్యక్షులు సిద్దబోయిన నర్సయ్య, తుడుందెబ్బ మండల అధ్యక్షులు ఈసం నాగేశ్వరావు, ఆదివాసీ ఉద్యోగుల సంఘం మండల కార్యదర్శి మూడిగ రాంచందర్, మొల్కం లక్ష్మినర్సు, పూర్ణచందర్,వెంకటేశ్వర్లు, ఆదివాసీ జాక్ కార్యర్శి రాము, భరత్, సీపిఐ న్యూడేమోక్రసీ జిల్లా నాయకులు ప్రభాకరన్న, జెజ్జరి సమ్మయ్య, ఆదివాసీ యువకులు పాల్గొన్నారు.