(Reduce Weight) నడక.. ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెప్తుంటారు. అయితే, ఎంత సేపు నడవాలి? రోజులో ఎన్ని అడుగులు తప్పనిసరిగా వేయాలి? ఇన్నే అడుగులు వేయాలనే నిబంధన ఏదైనా ఉన్నదా? అనే సందేహాలు చాలా మంది మదిని తొలుస్తున్నాయి. టెక్నాలజీ పురోగతిలో మనం ఎన్ని అడుగులు వేశాం అనేది గుర్తించే వీలు కలుగుతున్నది. చేతిలోని ఫోన్, స్మార్ట్ వాచ్, ఇతర డిజిటల్ పరికరాల సాయంతో రోజులో ఎన్ని అడుగులు వేశాం అనేది లెక్కించుకునే అవకాశం ఉన్నది. అయితే, బరువు తగ్గడానికి ఎన్ని అడుగులు పడాలి అనే ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోయింది. రోజుకు 10,000 అడుగులు వేయాలనే భావన చాలా మంది మనస్సులో నిలిచిపోయింది.
రోజూ వ్యాయామం చేయడం, అధిక బరువును నియంత్రణలో ఉంచుకోవడం పట్ల ఇటీవల చాలా మంది శ్రద్ధ చూపిస్తున్నారు. ఒక్కపైసా ఖర్చు పెట్టకుండా శరీరం బరువు తగ్గించుకోవడంలో నడక ఎంతగానో సహాయపడుతుంది. జిమ్కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంటి వద్దనే ఎంచక్కా వాకింగ్ చేయొచ్చు. అయితే, ఇన్నే అడుగులు వేయాలి.. ఇంతకు మించి అడుగులు వేయడానికి వీల్లేదు అనే నిబంధనలేవీ లేవు. టెక్సాస్ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం ప్రకారం, చురుకైన వ్యక్తులు 5,000 అడుగులు లేదా అంతకంటే తక్కువ వేసిన్నప్పుడు వారిలో మరుసటి రోజు జీవక్రియలు సక్రమంగా జరుగడం లేదు. అందుకని రోజుకు 5,000 అడుగులకు తక్కువ కాకుండా వేయడం అత్యవసరం. గుండె వ్యాధులు, స్థూలకాయం, డయాబెటిస్, అధిక రక్తపోటు, డిప్రెషన్.. వంటి అనారోగ్యాలను నడక ద్వారా దూరం చేసుకోవచ్చు. నడక వల్ల గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం 31 శాతం వరకు తగ్గుతుందని, సీవీడీ సమస్యలతో మరణాల ప్రమాదం 32 శాతం తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు.
వ్యాయామం ద్వారా కొవ్వులను కరిగించే వారి శరీరం, వాటిని తిరిగి పొందగలరని కెంటకీ విశ్వవిద్యాలయం అధ్యయనకారులు వెల్లడించారు. కైల్ ఫ్లాక్ రచించిన ‘మెడిసిన్ అండ్ సైన్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్’ అనే పరిశోధనాపత్రం 2020 లో ప్రచురితమైంది. ‘వ్యాయామం చేసేటప్పుడు కొంచెం శక్తిని కోల్పోతాం. ఈసమయంలో ఎక్కువగా తింటుంటాం. తక్కువ జీవక్రియ శక్తిని ఖర్చు చేస్తాం. కాబట్టి బరువు తగ్గడానికి తప్పనిసరిగా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. దాదాపు మూడు నెలలపాటు ఇలా చేయడం వల్ల శరీరం బరువు తగ్గడానికి దారితీస్తుంది’ అని కైల్ ఫ్లాక్ వెల్లడించారు. అడుగుల సంఖ్య పెరిగే కొద్ది ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువగా ఉంటాయిని పేర్కొన్నారు.
చైనా సైన్యంలో పాక్ అధికారుల రహస్య మోహరింపు.. ఎందుకంటే?
ఖట్టర్ నివాసం వద్ద రైతుల ఆందోళన, ఉద్రిక్త పరిస్థితులు
తాలిబాన్ అణిచివేతకు అమెరికా బిల్లు.. లక్ష్యం మాత్రం పాకిస్తాన్!?
హిమపాతంలో చిక్కుకున్న నేవీ సిబ్బంది.. గాలింపు ముమ్మరం
ఈ గడ్డపై పుట్టిన ఈ ఇద్దరు మహనీయులు అమరులు
మహిళల్లో రొమ్ము క్యాన్సర్ నివారణకు చిట్కాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..