(Gandhi and Shastri) నేడు ఇద్దరు మహనీయుల పుట్టినరోజు. ఒకరు జాతిపిత బాపూజీ, మరొకరు జై జవాన్, జై కిసాన్ రూపకర్త పూర్వ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. అన్యాయానికి వ్యతిరేకంగా ప్రపంచానికి ఓ సరికొత్త పోరాట మార్గాన్ని మహాత్మ గాంధీ పరిచయం చేశారు. వారు ప్రతిపాదించిన సత్యం, అహింస సిద్ధాంతాలు ప్రపంచ మానవాళి మీద చెరగని ముద్ర వేశాయి. కరంచంద్ గాంధీ 1869 లో జన్మించగా.. శాస్త్రీజీ 1904 లో పుట్టారు.
బ్రిటిష్ సంకెళ్ల నుంచి దేశాన్ని విడిపించడంలో కరంచంద్ గాంధీ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించారు. తన సత్యం, అహింస సూత్రం ఆధారంగా అనేక సార్లు బ్రిటిష్ వారి ఎదుట మోకరిల్ల వలసి వచ్చింది. ప్రపంచం మొత్తం ఆయన అహింస సూత్రానికి వందనం చేసింది. అందుకే ప్రపంచం మొత్తం ఈ రోజుని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటుంది. భారతీయ సమాజంలో ప్రబలంగా ఉన్న అంటరానితనం వంటి చెడులకు వ్యతిరేకంగా గాంధీజీ నిరంతరం తన స్వరాన్ని వినిపించారు. ప్రజలందరూ సమాన హోదా కలిగిన సమాజాన్ని సృష్టించాలని ఆయన కోరుకున్నారు. మహిళల సాధికారత కోసం తుది శ్వాస వరకు కృషి చేశారు. మహాత్మా గాంధీ ఆలోచనలు ఎల్లప్పుడూ భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తానికి మార్గనిర్దేశం చేస్తున్నాయి, అలాగే కొనసాగుతాయని ఆశిద్దాం.
భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన దేశభక్తుల్లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రముఖుడు. మన దేశ రెండవ ప్రధానిగా సేవలందించారు. 1965 లో ఇండో-పాక్ యుద్ధం తరువాత, జనవరి 10, 1966 న, శాస్త్రిజీ పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్తో శాంతి ఒప్పందంపై సంతకం చేయడానికి తాష్కెంట్ కు వెళ్లారు. అక్కడ సమావేశం జరిగిన కొన్ని గంటల తర్వాత శాస్త్రీ అనుమదాస్పద స్థితిలో మరణించారు. అయితే గుండెపోటుతో మరణించాడని చెప్పారు. కుటుంబ సభ్యులు మృత దేహం చూసి నీలం రంగులో ఉందని ఎవరో విషం పెట్టి హత్య చేసారంటూ ఆరోపణలు చేశారు. శాస్త్రీజీ సేవలకు గాను మరణాంతరం భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ తో సత్కరించింది.
2007: ఉత్తర కొరియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో శిఖరాగ్ర సమావేశం
2006: అణు ఇంధన సరఫరా సమస్యపై భారతదేశానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించిన దక్షిణాఫ్రికా
2004: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కాంగోకు 5,900 మంది సైనికులను పంపే ప్రతిపాదనకు ఆమోదం
2001: ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాటో
1985: అమలులోకి వరకట్న నిషేధ సవరణ చట్టం
1961: బొంబాయిలో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు
1952: భారతదేశంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభం
మహిళల్లో రొమ్ము క్యాన్సర్ నివారణకు చిట్కాలు
అహ్మదాబాద్లో గుంతలు పూడ్చిన ఖర్చు రూ.693 కోట్లు!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..