జగిత్యాల : జగిత్యాల పట్టణాన్ని సుందరంగా అభివృద్ధి చేసి హరిత పట్టణంగా మార్చాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి పర్యటనలో భాగంగా సోమవారం శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోదావరి నది తీరాన హనుమాన్ గట్టు వద్ద హరితహారంలో భాగంగా మొక్కలు నాటినారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గతంలో నాటిన మొక్కల ఎదుగుదలను పర్యవేక్షించి విరివిగా మొక్కలు నాటాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
గోదావరి నది స్నాన ఘట్టాల వద్ద అపరిశుభ్రతను గమనించిన మమంత్రి ప్రతి 15 రోజులకు ఒక సారి స్పెషల్ ట్రైన్ వీలైనన్ని ఎక్కువ మంది కార్మికులను కేటాయించి ఎప్పటికప్పుడు శుభ్రంగా చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిని సస్పెండ్ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధర్మపురి పట్టణంలోని పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఐదో వార్డు ఎస్సీ కాలనీలో పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పట్టణ అభివృద్ధి, సమస్యల పై సంబంధిత మున్సిపల్, మిషన్ భగీరథ అధికారులు, కౌన్సిలర్లు తో రివ్యూ సమావేశం నిర్వహించారు. పట్టణంలోని మురికి కాలువలు క్లీన్ గా ఉండేలా, పారిశుద్ధ్యం పై ఎక్కువ శ్రద్ధ వహించాలని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్ , మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
టాయిలెట్లు శుభ్రం చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
యాదాద్రిలో వైభవంగా లక్షపుష్పార్చన
ఆగని పెట్రో వడ్డన.. లీటర్పై 35 పైసలు పెంపు
హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం