బోనకల్లు : యాసంగిలో ఆరుతడి పంటల సాగు రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రావినూతల గ్రామంలో గల రైతువేదికలో వ్యవసాయ, ఉద్యానవన పంటల సాగుపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంటల మార్పిడి వల్ల రైతాంగానికి ప్రయోజనం చేకూరుతుందన్నారు.
నీటిసౌకర్యం ఉన్న రైతులు నువ్వులు, ప్రొద్దుతిరుగుడు తదితర పంటలు పండించుకోవచ్చన్నారు. ఉద్యానవన పంటల్లో పామాయిల్ సాగుకు ప్రాముఖ్యత పెరుగుతుందని అన్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటం వల్ల రైతాంగం ఈ సాగుకే ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మధిర ఏడీఏ కొంగర వెంకటేశ్వరరావు, రైతుబంధు సమితి సభ్యులు మందడపు తిరుమలరావు, మండల రైతుబంధు కన్వీనర్ వేమూరి ప్రసాద్, సర్పంచ్ కొమ్మినేని ఉపేంద్ర, ఉపసర్పంచ్ బోయినపల్లి కొండ, ఎంపీటీసీ కందిమల్ల రాధ, రైతుబంధు గ్రామ కన్వీనర్ షేక్ జానీ, వ్యవసాయ అధికారులు అబ్బూరి శరత్బాబు, రైతుబంధు సభ్యులు బంధం శ్రీనివాసరావు, బొమ్మకంటి సైదులు, వ్యవసాయ విస్తరణ అధికారి తేజ తదితరులు పాల్గొన్నారు.