చింతకాని: ప్రతి దళితవాడ బంగారు మేడ కావాలని,దళితుల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని రాష్ట్ర రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మండల పరిధిలో చిన్నమండవ, జగన్నాథపురం తదితర గ్రామాల్లో ఆయన పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్, కోండబాల కోటేశ్వరరావు పాల్గొన్నారు.
ఈసందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు తీసుకొచ్చారని అన్నారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా చింతకాని మండలంలో దళితబంధు అమలు ద్వారా 26 గ్రామాల్లోని దళితులు స్వచ్చంధంగా టీఆర్ఎస్ పార్టీ జెండా కప్పుకుంటున్నారని, అంతే కాని దళితబంధు ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.