సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ నుంచి చట్ట సభలకు ఎన్నికవుతున్న మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. నుంచి లోక్ సభకు ఎన్నికైన మహిళా ఎంపీలు గడచిన 72 ఏళ్లలో కేవలం ముగ్గురే! ప్రస్తుత ఎన్నికల్లో కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే బరిలో నిలిచారు. రాష్ట్రంలోని ఓటర్లలో సుమారు 49 శాతం మంది మహిళలు ఉన్నప్పటికీ, లోక్సభలో వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉంది.
రాష్ట్రంలో నాలుగు లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఈసారి బీజేపీ, బీఎస్పీ చెరొక స్థానం నుంచి మహిళలను నిలిపాయి. మండి నుంచి కంగన రనౌత్ (బీజేపీ), కాంగ్రా నుంచి రేఖా రాణి (బీఎస్పీ) పోటీ చేస్తున్నారు. ఇదిలావుండగా, రాజ్య సభ ఎంపీలుగా ఈ రాష్ట్రం నుంచి 8 మంది మహిళలు ఎన్నికయ్యారు. శాసన సభకు 1967 వరకు మహిళలు ఎన్నిక కాలేదు. 1977, 2022లలో ఒకరు, 1998 ఎన్నికల్లో ఏడుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు.