చండీగఢ్, మే 8: పంజాబ్లో బీఎస్పీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ హోషియార్పూర్ అభ్యర్థి రాకేశ్ సోమన్ బుధవారం సీఎం భగవంత్ మాన్ సమక్షంలో ఆప్లో చేరారు.
రాకేశ్ మాట్లాడుతూ మాన్ ప్రభుత్వ విధానాలు తనను ఆకట్టుకున్నాయన్నారు. పేదలకు మెరుగైన విద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తున్నారని ప్రశంసించారు.