చెన్నై, మే 8: మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడంపై ఎన్నికల ప్రచార సభలలో ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేయడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని, వారిని అవమానించేలా మోదీ చేస్తున్న వ్యాఖ్యలను నిరోధిస్తూ ఆదేశాలివ్వాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.
ముఖ్యంగా ఇటీవల మోదీ చేసిన మంగళ సూత్రం, ముస్లింల్లో జననాల రేటు పెరుగుదల వంటి వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఇవి ఆ వర్గాన్ని అవమానించడమేనని అన్నారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కే సెల్వపెరుంతగై ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ను నెంబర్ చేయడానికి రిజిస్ట్రీ విముఖత వ్యక్తం చేశారని, ఈ విషయంలో ధర్మాసనం రిజిస్ట్రీకి తగు సూచనలు ఇవ్వాలని అడ్వకేట్ సూర్యప్రకాశం కోరారు. దీనిపై జోక్యం చేసుకున్న ధర్మాసనం రిజిస్ట్రీ అడిగే వివరాలతో సమాధానాన్ని దాఖలు చేయాలని కౌన్సిల్ను ఆదేశించింది.