ఎర్రుపాలెం:స్నేహం విలువేంటో చూపించారు ఈ మిత్రులు. ఆపదలో ఉన్న ఆప్త మిత్రుని కుటుంబానికి అండగా నిలిచి స్నేహం అంటే ఇదేరా..! అని నిరూపించారు వీరు.
ఎర్రుపాలెం మండల పరిధిలోని మామునూరు గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ డొక్కా కృష్ణయ్య ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో అతనితో కలిసి చదువుకున్న చిన్ననాటి స్నేహితులు కృష్ణయ్య కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.
1991లో ఏన్కూరు గురుకుల పాఠశాలలో చదివిన మిత్రులు తమ స్నేహితుడి కుటుంబానికి రూ.56,617ల ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మిత్రులు జీ.కాశయ్య, వీ.రవికుమార్, కే.ప్రవీణ్, జీ.వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు.