Inter Education | రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, జూలై -01 : జూనియర్ కళాశాలలో మెరుగైన బోధన అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఇంటర్ విద్యపై ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లతో సమీక్ష నిర్వహించారు.
జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఎన్రోల్ మెంట్, ఇంటర్ పరీక్షా ఫలితాలు, జూనియర్ కళాశాలలో మైనర్ రిపేర్, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలు, పోటీ పరీక్షల శిక్షణ, ఫైర్ సేఫ్టీ, ఇతర మౌలిక సదుపాయాలు తదితర అంశాల పై కలెక్టర్ చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు.
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న 10 ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిధిలో మొదటి సంవత్సరం 1777 అడ్మిషన్స్ సాధించడం లక్ష్యం కాగా.. 1116 మంది విద్యార్థులు (63% ) ఎన్రోల్ చేసుకోవడం జరిగిందని అన్నారు. జూనియర్ కళాశాలలో అడ్మిషన్స్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
జూనియర్ కళాశాలలో సివిల్ వర్క్, విద్యుత్ సరఫరా, పారిశుధ్య, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పన, మైనర్ రిపేర్ పనులకు ప్రభుత్వం 1 కోటి 80 లక్షల రూపాయలు మంజూరు చేసిందని, నిధులను సద్వినియోగం చేసుకుంటూ మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. జూనియర్ కళాశాలలో అందించే విద్య నాణ్యత పెరగాలని అన్నారు. లెక్చరర్స్ సకాలంలో కళాశాలకు హాజరు కావాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన జరగాలని అన్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో సప్లమెంటరీ పరీక్షలు ముగిసిన తర్వాత వేములవాడ ,ఎల్లారెడ్డి పేట, ఇల్లంతకుంట కళాశాలలో ఫలితాలు తక్కువగా వచ్చాయని తెలిపారు.
ఇంటర్ విద్య చాలా వెనకబడింది..
సిరిసిల్ల జిల్లాలో ఇంటర్ విద్య చాలా వెనకబడిందని, మౌలిక వసతుల కల్పన పనులు, పరీక్ష ఫలితాల్లో చాలా ఇంప్రూవ్ కావాలని అన్నారు. జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంక్షేమం కోసం అవసరమైన చర్యలు కట్టుదిట్టంగా తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ప్రతీ జూనియర్ కళాశాలలో రెగ్యులర్గా స్టూడెంట్ కౌన్సిలర్ల ద్వారా విద్యార్థులకు అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు.
జూనియర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్ కమిటీ ఏర్పాటు చేసి పోలీసుల సహకారంతో విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించాలని అన్నారు. విద్యార్థులకు కెరియర్ కౌన్సిలింగ్ అందించాలని అన్నారు. జూనియర్ కళాశాలలో క్రీడలు ఆడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. మన జిల్లాలోని జూనియర్ కళాశాల విద్యార్థులకు మెడిసిన్, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల కోసం అందించిన ప్రత్యేక శిక్షణ కారణంగా మంచి ఫలితాలు సాధించారని, ఇదే స్పూర్తి కొనసాగించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శ్రీనివాస్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లు, తదితరులు పాల్గొన్నారు.
Couple died | రెండు నెలల క్రితం ప్రేమ వివాహం.. సిగాచీ ఫార్మా ప్రమాదంలో దంపతులు దుర్మరణం
Chahat Bachpai | డ్రైనేజీని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ చాహత్ బాచ్పాయ్
NTR Vs Hrithik Roshan | వార్ 2 సెట్స్లో డ్యాన్స్తో దుమ్ము లేపబోతున్న స్టార్ హీరోలు!