B sathya prasad | పెగడపల్లి : ఎరువుల క్రయ విక్రయాలకు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా ఆధార్ కార్డుతో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ తెలిపారు. బుధవారం రోజు పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ యూరియా, ఇతర ఎరువుల స్టాక్ వివరాలను, ఎరువుల సరఫరాపై ప్రతీ రైతుకి ఎన్ని బస్తాలు సరఫరా చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా రైతులకు సంబంధించిన భూమి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ప్రస్తుతం రైతులు వేసిన పంటకు అవసరమైన ఎరువులు మాత్రమే సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. రికార్డులు పరిశీలించి స్టాక్ ఎంత వచ్చింది. ఎంత సరఫరా చేశాం అన్నది తప్పనిసరి రికార్డ్ చేసుకోగలరని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతులకు ఎవరికైనా ఎక్కువ మొత్తంలో ఎరువులు పంపిణీ చేసినట్లయితే అట్టి సొసైటీ సిబ్బందిపై, వ్యవసాయ శాఖ సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్, నంచర్ల సహకార సంఘం చైర్మన్ మంత్రి వేణుగోపాల్ తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, విండో సీఈవో మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
Motkur : తెలంగాణ ఉద్యమ వైతాళికుడు జయశంకర్ సార్ : దూళిపాల ధనుంజయ నాయుడు
Raj B Shetty | పెద్ద స్టార్లతో నటిస్తే ఇబ్బందులు పడాలి.. రాజ్ బీ శెట్టి కామెంట్స్ వైరల్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలి : ఓరుగంటి రమణారావు