మంచిర్యాల అర్బన్, ఆగస్టు 16 : నస్పూర్లోని ఏఎస్ఆర్ఆర్ నగర్కు చెందిన ఎర్ర వెంకటేశ్ (26) శనివారం బైక్పై శ్రీరాంపూర్ కాలనీ నుంచి సీసీసీ ఎక్స్ రోడ్ వైపు వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అం బులెన్స్కు సమాచారం అందించగా మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యులు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని దవాఖానకు రెఫర్ చేశారు. కుటుంబ సభ్యులు ఓ అంబులెన్స్ను సంప్రదించగా ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్తామని చెప్పి మరో ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు.
అకడ మూడు గంట ల పాటు ఆలస్యం జరగడం, తమ నుంచి రూ.37వేల వరకు వసూలు చేశారు. పరిస్థితి విషమించడంతో మరో దవాఖానకు తరలించగా అప్పటికే ఆలస్యమైందని వైద్యులు తెలిపారు. అదే రోజు రాత్రి వెంకటేశ్ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మంచిర్యాలలో ఏసీపీ ప్రకాశ్కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై ఆయన వివరణ కోరగా విషయం తన దృష్టికి వచ్చిందని బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.