MP Arvind | మున్సిపల్ ఎన్నికల వేళ జగిత్యాల మున్సిపాలిటీ బీజేపీలో టికెట్ల పంచాయతీ తారాస్థాయికి చేరింది. బీజేపీ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నక్సలైట్ల తూటాలకు భయపడకుండా పనిచేస్తే తనకు టికెట్ ఇవ్వలేదని ఓ బీజేపీ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశాడు. రూ.5 లక్షలకు టికెట్లు అమ్ముకున్నారంటూ బీజేపీ ఎంపీ అరవింద్, నియోజకవర్గ ఇంచార్జ్ బోగ శ్రావణిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
బీజేపీ ఎంపీ అరవింద్ గాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. ఎంపీ అరవింద్ ఓటమి జగిత్యాల నుండే మొదలవుతుందంటూ హెచ్చరించాడు. పార్టీ కోసం కష్టపడుతున్న వారికి టికెట్లు రాకపోవడంపై సీనియర్ నేతలు మండిపడుతున్నారు. జిల్లాకు వచ్చే నేతలను ఉరికించి తంతామని హెచ్చరిస్తున్నారు.
40 సంవత్సరాల నుంచి మా నాన్న, అమ్మ, నేను బీజేపీ పార్టీ కోసం పనిచేస్తున్నాం. అలాంటిది కండువా కప్పుకోని వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారంటూ కంటతడి పెడుతూ ఫోన్లో సదరు బీజేపీ కార్యకర్త తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నవీడియో ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది.
బీజేపీ ఎంపీ అరవింద్ గాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు
ఈ లుచ్చా గాళ్లకు భయపడే ప్రసక్తే లేదు.. ఉరికించి తంతాము
ఎంపీ అరవింద్ ఓటమి జగిత్యాల నుండే ప్రారంభం అంటూ తెగేసి చెప్పిన బీజేపీ నేతలు
జగిత్యాల మున్సిపాలిటీ బీజేపీలో ముసలం
ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నక్సలైట్ల తూటాలకు… pic.twitter.com/51EqteMune
— Telugu Scribe (@TeluguScribe) February 3, 2026
Jagthyal | జగిత్యాల మున్సిపల్ పోరులో జీవన్ రెడ్డి vs సంజయ్