వేములవాడ: ప్రజా సంక్షేమంలో ఎప్పుడూ ముందుండే బీఆర్ఎస్ ప్రభుత్వం.. కరీంనగర్ జిల్లాలోని వేములవాడ పట్టణ ప్రజలు, పరిసర గ్రామాల రైతుల కోసం అత్యాధునిక హంగులతో రెండు అంతస్తుల్లో కూరగాయల మార్కెట్ను నిర్మించింది. ఇటీవల నిర్మాణం పూర్తయిన మార్కెట్ త్వరలో ప్రారంభం కాబోతున్నది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
‘వేములవాడ పట్టణంలో నిర్మించిన రెండంతస్తుల కూరగాయల మార్కెట్ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ధన్యవాదాలు’ అని మంత్రి కేటీఆర్ ట్విటర్లో ఆంగ్లంలో పేర్కొన్నారు. ఈ ట్వీట్కు మార్కెట్ భవనం బయటి, లోపలి ఫొటోలను కూడా జత చేశారు. కాగా, తెలంగాణ సర్కారు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ కూరగాయల మార్కెట్ను నిర్మించింది.
A 2-floor vegetable market to be available soon for public in Vemulawada town. Thanks to Pattana Pragathi program of BRS govt@KTRBRS pic.twitter.com/SPpl6Uirly
— KTR News (@KTR_News) February 19, 2023