కరీంనగర్ : తెలంగాణలో ఏసీబీ (ACB) లంచగొండి అధికారుల భరతం పడుతున్నారు. రోజుకో చోట ఒకరు ఏసీబీకి రెడ్ హ్యండెడ్గా పట్టుబడుతున్నారు. తాజాగా శనివారంకరీంనగర్ జిల్లా గంగాధర సబ్ రిజిస్ట్రార్( Gangadhara sub-registrar) కార్యాలయానికి చెందిన సీనియర్ అసిస్టెంట్, ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ శివరపు సురేష్బాబును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
బాధితుడు, డాక్యుమెంటర్ అంజయ్య తన స్నేహితుడు అజయ్కుమార్ తండ్రి రాజేశం పేరుమీద ఉన్న నాలుగు గుంటల భూమిని గిఫ్ట్ డీడ్(Gift Deed) చేసి ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ను సంప్రదించాడు. గిఫ్ట్ చేయడానికి లంచం డిమాండ్ చేసిన సబ్ రిజిస్ట్రార్ సురేష్బాబు కార్యాలయానికి చెందిన సబార్డినేట్ కొత్తకొండ శ్రీదర్ ద్వారా రూ. 10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.